సింగపూర్‌లో సెటిల్ కానున్న చెన్నయ్ జంట!



కోలీవుడ్ ప్రేమ జంట ప్రభుదేవా, నయనతారలు ఇకపై తమకు తాముగా ప్రవాస జీవితం గడుపనున్నారు. త్వరలోనే మూడుముళ్ళ బంధంతో ఓ ఇంటివారు కానున్న ప్రభుదేవా, నయనతారలు.. సింగపూర్‌లో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నట్టు చెన్నయ్ కోడంబాక్కం వర్గాల సమాచారం.

త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న కోలీవుడ్ ప్రేమజంట ప్రభుదేవా, నయనతార సింగపూర్‌లో కాపురం పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య రమలతకు ప్రభుదేవా విడాకులు ఇవ్వగా, దీనికి ఇటీవలే చెన్నయ్ ఫ్యామిలీ కోర్టు ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో వివాహానంతరం చెన్నయ్‌లోనే కాదు సుమా భారత్‌లోనే ఉండేందుకు నయనతార చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట. అందుకే తన ప్రియుడు ప్రభుదేవాకు ఒక కండిషన్ పెట్టిందట. పెళ్లి తర్వాత సింగపూర్‌లో కాపురం పెట్టి అక్కడే సెటిల్ అయిపోదామని కోరిందట. 




Share your views...

0 Respones to "సింగపూర్‌లో సెటిల్ కానున్న చెన్నయ్ జంట!"

Post a Comment

 

© 2010 Cinemamasti.com All Rights Reserved