20 మంది దర్శకులు నటిస్తున్న చిత్రం




నగరం నిద్రపోతున్న వేళ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమరాజ్ తన రెండో చిత్రంలో వైవాహిక బంధంలోని ఒడిదుడుకుల్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సంచలనం సృష్టించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల అనైతికం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే, ఈ చిత్రంలోని అన్ని పాత్రల్ని తెలుగు చిత్రసీమలోని ప్రఖ్యాత దర్శకులు పోషిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. 

తెలుగులో ఈ తరహా ప్రయత్నం ఇదే మొదటిసారని దర్శకుడు తెలిపారు. కథానాయుడు మొదలుకొని ఈ చిత్రంలో కనిపించే ప్రతీ పాత్రలో ఒక దర్శకుడు కనిపిస్తాడని ఆయన అన్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో పరుచూరి వెంకటేశ్వరరావు, ఎన్. శంకర్, వి.ఎన్. ఆదిత్య, కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సాగర్, రాంప్రసాద్, ఎంఎస్ నారాయణ, ఏవీఎస్, మద్దినేని రమేష్ తదితరులు నటించారు. 

కీర్తన మూవీమేకర్స్ బ్యానర్ పై టి.వెంకటేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహ నిర్మాత: సత్యనారాయణరెడ్డి, సంగీతం: యశోకృష్ణ, కథ: యండమూరి వీరేంద్రనాథ్, మాటలు: పరుచూరి బ్రదర్స్, స్క్రీన్ ప్లే -దర్శకత్వం: ప్రేమరాజ్.




Share your views...

0 Respones to "20 మంది దర్శకులు నటిస్తున్న చిత్రం"

Post a Comment

 

© 2010 Cinemamasti.com All Rights Reserved